చెన్నై : తమిళనాడులో రాజకీయం రసకందాయంలో పడింది. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై సభాపతి అనర్హత వేటు వేసిన నేపత్యంలో విపక్ష నేత స్టాలిన్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు డీఎంకే ఎమ్మెల్యేలతో నేడు అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. పళని స్వామి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని విపక్షం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.