ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రెసిడెంట్ మెడెల్ అందుకున్న డీఐజీ రూప

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2017, 11:51 AM

కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో అక్రమాలు రాజ్యమేలుతున్నాయని, ఏఐఏడీఎంకే నాయకురాలు శశికళ రాజభోగమేలుతున్నారని సంచలన ప్రకటనలు చేసి పత్రికలకు ఎక్కిన ఆ రాష్ట్ర జైళ్లశాఖ మాజీ డీఐజీ డీ రూప రాష్ట్రపతి పతకాన్ని అందుకున్నారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గవర్నర్ వాజుభాయ్ వాలా ఈ పతకాన్ని అందజేశారు. అక్రమాస్తుల కేసులో శశికళకు కోర్టు జైలు శిక్ష విధించగా ఆమెను పరప్పన అగ్రహార జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే జైలు సిబ్బంది శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని, ఆమె జైలులో ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నారని పేర్కొంటూ రూప ఉన్నతాధికారులకు ఓ నివేదికను అందజేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె పత్రికల్లోకెక్కారు. అనంతరం ఆమెను జైళ్లశాఖ నుంచి మరో విభాగానికి ప్రభుత్వం బదిలీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com