ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువరాజ్ సింగ్ టీమిండియాకి దేవుడిచ్చిన బహుమతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 16, 2017, 04:48 PM

ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ టీమిండియాకి దేవుడిచ్చిన బహుమతి అని సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ సందీప్ పాటిల్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా‌తో వన్డే సిరీస్‌ కోసం ఇటీవల ప్రకటించిన భారత్ జట్టులో యువరాజ్ సింగ్‌కి చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ సిరీస్ కంటే ముందు శ్రీలంక పర్యటనకి కూడా విశ్రాంతి పేరుతో యువీని సెలక్టర్లు పక్కన పెట్టారు. దీంతో ఈ ఆల్‌రౌండర్ కెరీర్ ముగిపోయినట్లేనా..? అని సందీప్ పాటిల్‌ని ప్రశ్నించగా.. ఆయన సమాధానమిచ్చారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.


‘నేను ఇప్పుడు సెలక్టర్ కాదు. భారత జట్టుకి యువరాజ్ సింగ్ దేవుడిచ్చిన బహుమతి. జట్టులోకి పునరాగమనం అతని ఫిటెనెస్, ఫామ్‌పైనే ఆధారపడి ఉంటుంది. నేను కూడా అతనికి అభిమానినే. కానీ.. 2019 ప్రపంచకప్‌లో యువరాజ్ ఆడాలంటే బోర్డుపై పరుగులు చేస్తూ.. మైదానంలో ఫిటెనెస్‌ నిరూపించుకోక తప్పదు. మెగా టోర్నీకి రెండేళ్ల సమయం ఉంది. కాబట్టి.. అతను వాటిపై దృష్టి కేంద్రీకరిస్తే పునరాగమనం సాధ్యమే’ అని సందీప్ పాటిల్ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com