బాంబే హైకోర్టుకు బుధవారం ఉదయం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ మంజులా చెల్లూర్కే నేరుగా ఫోన్ చేసిన ఓ గుర్తు తెలియని అంగతకుడు.. కోర్టులోని రూమ్ నెం. 51లో బాంబు పెట్టినట్లు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన చీఫ్ జస్టిస్ తక్షణమే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన కోర్టు వద్దకు చేరుకున్న బాంబ్ స్కాడ్ తనిఖీలు చేపట్టింది. తనిఖీల అనంతరం కోర్టులో బాంబు లేదని పోలీసులు తేల్చారు. దీంతో అటు చీఫ్ జస్టిస్, న్యాయవాదులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.