చైపాస్: మెక్సికోలో వచ్చిన భారీ భూకంపం వల్ల మృతిచెందిన వారి సంఖ్య 61కి చేరుకున్నది. గురువారం మెక్సికో తీరంలో 8.2 తీవ్రతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. టొబాస్కో, ఒక్సాకా, చైపాస్ రాష్ట్రాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఈ రాష్ట్రాల్లో శిథిలాలను తొలిగించే ప్రక్రియలో అధికారులు ఉన్నారు. ఇంకా అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. భూకంపం వల్ల కనీసం 200 మంది గాయపడి ఉంటారని అధ్యక్షుడు ఎన్రిక్ నీటో తెలిపారు. ఈ ప్రాంతంలో 8.2 తీవ్రతతో భూకంపం రావడం ఈ శతాబ్ధంలోనే అత్యంత శక్తివంతమైనగా భావిస్తున్నారు. ఒక్క ఒక్సాకా రాష్ట్రంలోనే 45 మంది చనిపోయారు. చైపాస్లో మరో 12 మంది చనిపోయారు.