విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. బ్లాస్ట్ ఫర్నేస్ యూనిట్ లో ల్యాడిల్కు రంధ్రం పడింది. దీంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. దీంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో రూ. 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.