-ఎరచ్రందనం అక్రమ రవాణాను ఉపేక్షించవద్దు
-తీరప్రాంతాల్లో మామిడి తోటల పెంపకం
-నగరవనాలను త్వరితగతిన పూర్తి చేయండి
-కార్యాచరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : కొల్లేరు సరస్సును రాష్ట్రంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు వారం లోగా పొందేలా కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులను ఆదేశించారు. ఎరచ్రందనం అక్రమ రవాణాను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు అరికట్టడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని సూచిం చారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీ స్టేట్ బోర్డ ఫర్ వైల్డ లైఫ్ మూడవ సమీక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. అలాగే రాష్ట్రంలోని పక్షి సంరక్షణ కేంద్రాలను, జింకలు, ఎలుగుబంటుల పార్కులను మరింత అభివృద్ధి చేసి, ఆకర్షణీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలోనే పెద్దదైన పులుల సంరక్షణ కేంద్రం మన రాష్టంలోనే ఉందని దానిని టూరిస్ట స్పాట్గా మార్చాలంటే దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను అనుమ తించాల్సి ఉంటుదన్నారు. ఇందుకోసం అధికారులు కృషి చేయాలని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నగర వనాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ధేశిం చారు. విజయవాడలోని ఓ కొండను నైట్ సఫారీకి అనువుగా తీర్చిదిద్దే అంశాన్ని పరిశీలించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అడవుల్లో పెద్దఎత్తున చెక్ డ్యాంలు నిర్మించి అటవీ విస్తీర్ణం పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పారు. రాష్ట్రంలో ఎవరు మొక్కలు పెంచేందుకు ముందు కొచ్చినా, అడిగిన వెంటనే అందించే విధంగా ట్రీ బ్యాంకు ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఆన్లైన్లో కూడా మొక్కలు అందించడానికి అటవీ శాఖ సిద్ధంగా