ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీకంటికి నేను వెలుగునవుతా: నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 08, 2021, 02:34 PM

నీ కంటికి నేను వెలుగునవుతానంటూ 85 ఏళ్ల వృద్ధుడు వీరయ్య కుటుంబానికి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో బుధవారం నారాలోకేష్ పర్యటించారు. పర్యటనలో భాగంగా నారా లోకేష్ 85 ఏళ్ల వీరయ్య, సుభద్ర దంపతులను కలుసుకొని వారితో మాట్లాడారు.


వైకాపా ప్రభుత్వం 3 వేల పెన్షన్ ఇస్తాను అని అన్నారని కానీ కేవలం రూ. 250 మాత్రమే పెంచారని, పెరిగిన రేట్లతో బ్రతకడం కష్టంగా మారిందని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.


కళ్ళు కనపడక ఇబ్బంది పడుతున్నానని ప్రభుత్వం ఆపరేషన్ చేయిస్తుందని చెప్పారని, ఇప్పటి వరకూ ఆపరేషన్ చేయించలేదని చెప్పారు. నిన్ను చూడాలని ఉన్నా చూడలేని పరిస్థితి అంటూ తన బాధని లోకేష్ కి వీరయ్య చెప్పాడు.


ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వీరయ్య కి కంటి ఆపరేషన్ తన సొంత ఖర్చుతో చేయిస్తానని హామీ ఇచ్చారు. వారంలో ఆపరేషన్ కి ఏర్పాట్లు చెయ్యాలని తన వ్యక్తిగత సిబ్బందికి చెప్పారు. దీంతో వృద్ధ దంపతులు హర్షం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com