దేశంలో గడిచిన 24 గంటల్లో 8,439 మందికి కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. వైరస్ బారిన పడి నిన్న 195 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు క్రితం రోజు 18 నెలల కనిష్టానికి తగ్గిన కేసులు.. తాజాగా 23 శాతం మేర పెరిగినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు 3.46 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 4.73 లక్షలకు చేరింది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన వారి సంఖ్య 23 కు చేరింది. నిన్న 73 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు.