ట్రెండింగ్
Epaper    English    தமிழ்

300 మంది యువతులకు వివాహం చేసిన మహేశ్ సవానీ

national |  Suryaa Desk  | Published : Mon, Dec 06, 2021, 01:53 PM

వివాహమంటే భారీ ఖర్చు తప్పదు. అయితే వివాహ వేడుకల ఖర్చు భరించలేని పేదవారు ఎందరో ఉన్నారు. ఇటువంటి 300 మంది యువతులకు సామూహిక వివాహ వేడుక నిర్వహించి పీపీ సవానీ గ్రూప్ అధినేత మహేశ్ సవానీ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు . గుజరాత్ లో జరిగిన ఈ సామూహిక వివాహ వేడుకలో 300 జంటలు ఒక్కటయ్యాయి. వేద మంత్రాల సాక్షిగా సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. మహేశ్ సవానీ చొరవతో నవ దంపతులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. 2008లో తొలిసారిగా ప్రారంభించిన ఈ సామూహిక వివాహ వేడుక నేటికీ కొనసాగుతోంది. సవానీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 4 వేలకు పైగా జంటలు ఒక్కటయ్యాయని పీపీ సవానీ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. కరోనా భయాల కారణంగా ఈ వివాహా వేడుకకు పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించారు. గుజరాత్  హోం మంత్రి హర్ష్ సంఘ్వీ, గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్  హాజరయ్యారు. 4000 మందికి పైగా ఆడపిల్లలకు పెంపుడు తండ్రిగా మారి కన్యాదానం జరిపించినందుకు గర్వపడుతున్నానని మహేశ్ సవానీ తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com