-ఈ ఏడాది 14 శాతం అధికంగా పరీక్షలకు విద్యార్థులు హాజరు
-ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షల ఏర్పాట్లు
-పూర్తి స్థాయిలో ల్యాబ్ సౌకర్యాలు లేని కళాశాలలపై చర్యలు
-రాష్ర్ట మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు
విజయవాడ, మేజర్న్యూస్ : మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు జరగ నున్నాయని, ఎమ్మెల్సీ ఎన్నికల దష్టా్య మార్చి 9న జరగాల్సిన పరీక్షను 19న నిర్వహిస్తున్నామని రాష్ర్ట మానవ వనరుల అభివద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఆయన సచివాలయంలోని నాలుగో బ్లాక్ సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో విద్యార్థు లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 14 శాతం మంది విద్యా ర్థులు ఎక్కువగా పరీక్షలు రాస్తున్నారన్నారు. ఇంటర్ ప్రాక్టికల్సను జంబ్లింగ్ లో నిర్వ హించామని, అరకొర ల్యాబ్ సౌకర్యాలు ఉన్న కొన్ని కళాశాలలు తమ దృష్టికి వచ్చాయని వీటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది 10,31,285 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా ఇందులో మొదటి సంవత్సరం విద్యా ర్థులు 5,23,099 మంది, ద్వితీయ సం. విద్యార్థులు 5,08,186 మంది అని తెలిపారు. 1445 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు నిర హించనున్నామన్నారు. పరీక్షా కేంద్రాలకు దగ్గరలోని ఫొటోస్టాట్ సెంటర్లను మూసివేస్తామని, కరెంట్ కోతలు లేకుండా చూస్తామన్నారు. అర్టీసీ అధికారులతో చర్చించి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని మంత్రి గంటా స్పష్టం చేశారు. సిట్టింగ్ స్కా్వడ్లు, ఫ్లయింగ్ స్కా్వడ్లను ఏర్పాటు చేయడంతోపాటు ఇప్పటికే పరీక్ష ల్లో పాల్గొనే సిబ్బందికి గుర్తింపు కార్డులు అందజేశామన్నారు. ఇప్పటికే కలెక్టర్లు, ఎస్.పిలతో వీడియో కానాేరెన్స ద్వారా సమీక్ష కూడా నిర్వహించామని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.