కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' ఇప్పటికే 30కి పైగా దేశాలకు విస్తరించింది. ఇప్పటివరకు 370కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇక తొలుత ఒమిక్రాన్ను కనుగొన్న దక్షిణాఫ్రికాలో కీలకమైన సార్స్కోవ్-2 ఆర్నాట్ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఈ వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడం మరింత కష్టం కానుందని నిపుణులు చెబుతున్నారు. భారత్లో కూడా ఇద్దరిలో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులను కర్ణాటక రాష్ట్రంలో గుర్తించారు. బాధితుల్లో ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఐదుగురికి కూడా కరోనా సోకింది. వారికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందో లేదో మాత్రం తేలలేదు.