కర్నూలు: గుర్తు తెలియని వ్యక్తి రైలు క్రిందపడి మృతి చెందిన సంఘటన ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 50 ఉంటుందని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఆదోని రైల్వే ఎస్ఐ శివరాములు సుబ్బారాయుడు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.