నీట్ -పీజీ-2021 కౌన్సిలింగ్ ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా రెసిడెంట్ వైద్యులు ఆందోళనలకు దిగారు. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చిన దేశవ్యాప్త నిరసనలకు సంఘీభావంగా వైద్యులు తమవిధులు బహిష్కరించి ఆందోళనల్లో పాల్గొన్నారు. దిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రి ముందు రెసిడెంట్ వైద్యులు కౌన్సిలింగ్ త్వరగా చేపట్టాలని నినాదాలు చేశారు. లేడీ హార్డింగే మెడికల్ కళాశాలలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నీట్ -పీజీ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.