ముంబై : ముంబైలో ప్రఖ్యాతి గాంచిన లాల్ బాగ్ ఛా రాజా గణేశుడిని ఇవాళ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దర్శించుకున్నాడు. సచిన్తోపాటు సతీమణి అంజలి, కుమారుడు అర్జున్, కూతురు సారా టెండూల్కర్లు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన సచిన్ను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.