నటి ప్రియమణి తన బాయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్ ల వివాహం ఈ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులో సింపుల్ గా జరిగింది. కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకి హాజరైనట్టు తెలుస్తుంది. ఇద్దరి కులాలు వేరు కావడం వలన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట రేపు ( ఆగస్ట్ 24) సాయంత్రం రిసెప్షన్ జరుపుకోనున్నారు. బెంగళూర్ లో సాయంత్రం 7గం.ల నుండి జరగనున్న ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరు కానున్నట్టు సమాచారం. పెళ్ళికి ముందు రోజు ప్రియమణి ఇంట మెహందీ మరియు సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక రిసెప్షన్ తర్వాత మరో రెండు రోజులలో ఈ అమ్మడు షూటింగ్ కి వెళ్ళనుంది. ప్రస్తుతం మలయాళంలో ‘సైలంట్ రేడియో’, ‘పెర్ఫ్యూమ్’, ‘యస్ ఐ యామ్’, ‘పెయింటింగ్ లైఫ్’, ‘గ్రాండ్ మాస్టర్ 2’, ‘సత్యాన్వేషణ పరీకణగళ్’ సినిమాలతో బిజీగా ఉంది. ప్రియమణి ప్రేమాయణం ఓ డ్యాన్స్ షో ద్వారా సాగిన సంగతి తెలిసిందే. ముస్తఫాను తొలిసారిగా ఓ డ్యాన్స్ షోలో కలిసిన ఈ అమ్మడు.. ఆ పరిచయాన్ని ప్రేమగా, ఆ తర్వాత వివాహం గా మార్చుకున్న సంగతి తెలిసిందే.