ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ పర్యటనపై జెఇఓ బిజీబిజీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 12:55 AM

  తిరుమల, సూర్య ప్రత్యేక ప్రతినిధి : మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తన మంత్రివర్గ అనుచరులతో తిరుమలకు రానున్న నేపథ్యంలో తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు ఉదయం నుంచి మంత్రివర్గం బస చేసే కాటేజి లను క్షుణ్ణంగా తనిఖీ చేసి వసతుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. వారికి అవసరమగు ఆహార విషయాలు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి గట్టి చర్యలు గైకొంటున్నారు. ఇక దర్శన విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కె.చంద్రశేఖర్‌రావు స్వామి వారికి రూ.5 కోట్లు విలువ చేసే వజ్రాల హారాలను సమర్పించనున్న నేపథ్యంలో కెసిఆర్‌ తిరుమల పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఇందుకు టిటిడి అధికార యంత్రాంగం వారి భద్రత విషయంలో ఎలాంటి లోటు రానీవ్వకుండా సర్వం సిద్ధం చేసింది. తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com