నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైతే గుండు గీసుకుంటానని ఆపార్టీ నేత బొండా ఉమ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీదే విజయమని జోస్యం చెప్పారు. టీడీపీ చేసిన సంక్షేమ కార్యక్రమాలే పార్టీని విజయం దిశగా నడిపిస్తాయని ఆయన చెప్పారు. నంద్యాలలో ఓటమిపాలైతే తాను గుండుకి సిద్ధమని, వైఎస్సార్సీపీ ఓటమిపాలైతే గుండు గీసుకునేందుకు మీరు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వైఎస్సార్సీపీ నేతలెవరైనా తన సవాల్ స్వీకరించగలరా? అని ఆయన ప్రశ్నించారు.