ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

international |  Suryaa Desk  | Published : Thu, Oct 28, 2021, 10:13 AM

భారత్ రక్షణ రంగంలో మరో పెద్ద ఘనతను సాధిచింది. దేశ ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చాటేలా చేసింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అగ్ని-5 బాలిస్టిక్‌ మిసైల్ ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగం ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి పరీక్షించారు.డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించిన ఈ క్షిపణి ప్రయోగం 2020లోనే జరుగాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల రీత్యా వాయిదా పడింది. ప్రస్తుతం భారత్ -చైనా సరిహద్దుల ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఇండియా ఈ పరీక్ష చేయడం ఆసక్తిగా మారింది.


మూడు-దశల ఘన-ఇంధన ఇంజిన్‌ను ఉపయోగించే ఈ క్షిపణి 5వేల కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. కచ్చితమై లక్ష్యాలను ఛేదించడం ఈ క్షిపణి లక్షణం. గతంలోని అగ్ని-1,2,3,4లకు మించి అదనపు సామర్థ్యాన్ని ఈ క్షిపణి కలిగి ఉంటుంది. ఇతరులు మన దేశంపై దాడి చేస్తే తప్ప ముందుగా ఈ క్షిపణులను వాడొద్దనేది ఇండియా కట్టుబాటు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నిర్మించింది


కరోనా కారణంగా గతేడాది పరీక్షించాల్సిన క్షిపణిని ఇప్పుడు ప్రయోగించామని ప్రభుత్వం చెబుతున్నా... అంతర్జాతీయ సమాజం ఈ పరీక్షను మరో కోణంలోనే చూస్తున్నాయి. ఇప్పుడు ఈ క్షిపణి ప్రయోగం, పనితీరును ఇండియా పరీక్షించింది. ఈ క్షిపణి సామర్థ్యం 5వేల కిలోమీటర్లు అంటే చైనాలో దాదాపు ప్రతీ చోటకు వెళ్లేలా దీన్ని ప్రయోగించవచ్చనే వాదనలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com