గుంటూరు: గుంటూరులోని నాగార్జున వర్శిటీ వద్ద అర్ధరాత్రి 12 గంటలకు కోమిట్ల ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నిలిపివేశారు. విశాఖ నుంచి బెంగళూరు వెళ్తుండగా సాంకేతికలోపంతో బస్సు నిలిచిపోయింది. కానీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ప్రత్యామ్నాయం లేక ప్రయాణికులు రోడ్డుపైనే రాత్రంగా జాగారం చేశారు. కోమిట్ల ట్రావెల్స్ బస్సు నిర్వాహకుల తీరుపై ప్రయాణికులు మండి పడుతున్నారు.