అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన డీఎంకే అధినేత కరుణానిధి డిశ్చార్జ్ అయ్యారు. ఉన్నట్లుండి ఆయన అనారోగ్యానికి గురవ్వడంతో తెల్లవారుజామున చెన్నైలోని కావేరీ ఆస్పత్రికి తరలించారు. పలు పరీక్షలు జరిపిన డాక్టర్లు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని కరుణానిధి కుమార్తె కనిమొళి తెలిపారు. గతేడాది కూడా శ్వాసకోశ సమస్యలతో కరుణానిధి ఆస్పత్రిలో దాదాపు పది రోజుల పాటు చికిత్స పొందారు. కరుణానిధి ఆస్పత్రిలో చేరారని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.