'జగనన్న తోడు' కార్యక్రమంలో భాగంగా వడ్డీ సొమ్మును లబ్ధి దారుల బ్యాంక్ ఖాతాల్లో సీఎం జగన్ బుధవారం జమ చేయనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటి విడత జగనన్న తోడు కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన (సెప్టెంబర్ 30లోగా) 4.5 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ది చేకూరనుంది. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది. ఈ పథకం కింద ప్రతి ఒక్కరికి ఏటా రూ.10వేల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తీసుకున్న రుణం చెల్లిస్తేనే తిరిగి రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.