ఇడుపులపాయ: కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను షర్మిల ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సమాధి వద్దకు తల్లి విజయమ్మతో కలిసి చేరుకుని ప్రార్థనలు చేశారు.తెలంగాణలో షర్మిల పాదయాత్ర 400 రోజుల పాటు 90 శాసనసభ నియోజకవర్గాల్లో 4వేల కి.మీ మేర సాగనుంది. రేపు ఉదయం 11 గంటలకు చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభమవుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు.