ఆమె నలుగురు పిల్లల తల్లి. అతనో పెళ్లి కాని యువకుడు. ఇద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. పరిస్థితి ఎక్కడ వరకూ వెళ్లిందంటే ఇద్దరూ కలిసి ఆ మహిళ ఇంట్లోనే కలిసేవాళ్లు. ఆదివారం అర్ధరాత్రి కూడా అలానే కలిసి ఉండగా గ్రామస్తులు ఆ యువకుడిని పట్టుకుని చేతులు కట్టేసి చితకబాదారు. ఆ సమయంలో మహిళ భర్త ఇంట్లో లేడు. జార్ఖండ్లోని షాహిబ్గంజ్ జిల్లాలోని రాజామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో యువకుడికి దేహశుద్ధి చేసిన వీడియో వైరల్గా మారింది. గ్రామానికి చెందిన ఓ నలుగురు పిల్లల తల్లి, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో నాలుగేళ్ల నుంచి గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఆమె భర్త ఊళ్లో లేనప్పుడల్లా ఆ వివాహిత ఇంటికే యువకుడు నేరుగా వెళ్లేవాడు. అయితే ఊళ్లో వాళ్లకు అనుమానం రాకుండా అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఇదే మాదిరిగా గత ఆదివారం రాత్రి కూడా ఆ వివాహిత భర్త ఊళ్లో లేడు. ఏదో పని మీద వేరే ఊరు వెళ్లాడు. భర్త ఆరోజు రాడని తెలుసుకున్న వివాహిత తన ప్రియుడికి ఫోన్ చేసి తన భర్త ఇంట్లో లేడని, రావాలని చెప్పింది. ఆమె సిగ్నల్ ఇవ్వడంతో హుటాహుటిన ఆ యువకుడు అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే ఈ ఇద్దరి వ్యవహారాన్ని గమనించిన గ్రామస్తులు ఆ యువకుడు ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే అక్కడకు వెళ్లారు. ఆ యువకుడిని చేతులు కట్టేసి విచక్షణారహితంగా చితక్కొట్టారు. పిడిగుద్దులతో దాడి చేశారు. ఆ మహిళను కూడా కొట్టారు. ఈ ఘటనను గ్రామస్తుల్లో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో రాజామహల్ స్టేషన్ ఇన్ఛార్జ్ ప్రణీత్ పటేల్ స్పాట్కు చేరుకుని ఆ మహిళను, యువకుడిని స్టేషన్కు తరలించి విచారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.