పిలుపునిచ్చిన ‘భారత్ బంద్’ దేశవ్యాప్తంగా మొదలైంది. కమ్యూనిస్టు పార్టీలతో పాటు బంద్కు మద్దతు తెలిపిన పార్టీల నాయకులు తెల్లవారుజామునే డిపోల దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. ఎక్కడికక్కడ బస్సులను నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ ‘భారత్ బంద్’ పిలుపునకు కాంగ్రెస్ సహా 19 రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రత్యక్షంగా భారత్ బంద్లో పాల్గొననున్నట్లు స్పష్టం చేశాయి. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు ఈ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపే ఉద్దేశంతో భారత్ బంద్ నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ‘భారత్ బంద్’ మొదలైంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజా రవాణా, మార్కెట్లు, దుకాణాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ బంద్ గురించి ‘సంయుక్త కిసాన్ మంచ్’ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ బంద్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని విద్యా సంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వ్యవస్థలు నిలిచిపోనున్నట్లు తెలిపారు.