దోమే కదా అని నిర్లక్ష్యం చేశారో అంతే సంగతులు. ఇకపై దోమ కాటుకు గురయ్యారంటే వెంటిలేటర్ వరకు వెళ్లడం ఖాయం. దోమలు మరింత పవర్ఫుల్గా మారాయి. డెంగ్యూ దోమలు కొత్త మ్యూటెంట్ను తయారు చేసుకున్నాయి. దాదాపు 11 రాష్ట్రాల్లో ఈ న్యూ వేరియంట్ ఇప్పుడు అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఏపీ, తెలంగాణతోపాటు గుజరాత్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో డెంగ్యూ కొత్త మ్యూటెంట్ బీభత్సం సృష్టిస్తోంది. న్యూ వేరియంట్ దెబ్బకు ప్రతిరోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.