మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు కలిశారు. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఎస్సిలపై బిసిలపై జరుగుతున్న దాడులు, అన్యాయం వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వారి సమస్యల పరిష్కారానికి ఏవిధంగా ముందుకు వెళ్లాలో అధినేత నుంచి సూచనలు అందుకున్నాం అని శేషు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర నాయకులు కొండపల్లి రవి, రెల్లి సంక్షేమ సంఘం నాయకులు మాడుగుల షణ్ముక్ తదితరులు పాల్గొన్నారు.