అమృత్ సర్- బౌండ్ అకల్ తాకత్ ఎక్స్ ప్రెస్ లో అనుమానాస్పద వస్తువు కలకలం సృష్టించింది. ట్రెన్ టాయిలెట్ లో ఓ ప్యాకెట్ ను గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారమివ్వడంతో రైలును అమేథీ స్టేషన్ లో నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువు కనిపించిన రెండు బోగీలను ట్రైన్ నుంచి విడదీసి తనిఖీలు చేస్తున్నారు. లక్నో నుంచి ప్రత్యేక బృందం రైల్ వద్దకు చేరుకుంది. బాంబ్ ను నిర్వీర్యం చేసే ప్రత్యేక టీం ట్రైన్ లో దొరికిన వస్తువును పరిశీలిస్తున్నది.