ఉత్తరాఖండ్ ను భారీ వరదలు అతలతాకుతలం చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ఏజెన్సీ గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. మడ్ కోట్ ప్రాంతంలో బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో 56 మేకలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. బ్రిడ్జి కొట్టుకుపోవడంతో వాగు అవతలి పక్క గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ టీంలు కమ్యూనికేషన్ వ్యవస్థను బాగు చేస్తున్నాయి.