విశాఖ జిల్లా మాడుగుల మండలం లో జరిగిన ఎంపిటిసి ఎన్నికలు లో కెజె పురం 1 వ సిగ్మెంట్ అభ్యర్థి ఒకే ఒక ఓటు తో స్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి తో తలపడిన టీడీపీ అభ్యర్థి చిన్నమ్ లొవతల్లి ఒక ఓటు తో గెలుపొందింది. వైసీపీ అభ్యర్థికి 610 ఓట్లు రాగా దేశం అభ్యర్థికి 611 ఓట్లు వచ్చాయి. దింతో తిరిగి లెక్కింపు చేయాలనీ వైసీపీ శ్రేణులు పట్టు పట్టడం తో ఎన్నికల అధికారులు మరలా లెక్కింపు జరిపినప్పటికి.. మరలా ఒకే ఒక ఓటు తో దేశం అభ్యర్థి లొవతల్లి విజయం సాధించింది. దీంతొ ఆమె గెలుపొందినట్టు ప్రకటించారు. దీంతొ మాడుగుల మండలంలో కెజె పురం రెండు స్థానాలు టీడీపీ ఖాతాలో చేరాయి.