కోల్కతా : పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బస్సు అదుపుతప్పి కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. కోల్కతాకు 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసిన పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.