తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం ఐటీడీపీ మైలవరం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సోమవారం ఉదయం నియోజకవర్గ చాంపీయన్స్ పరసా కిరణ్ ఆధ్వర్యంలో గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు, ఐ టిడిపి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు అద్దేపల్లి శివ,చిరుమామిళ్ళ కృష్ణా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా దేవినేని ఉమమహేశ్వరరావు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలనను ప్రజలందరికీ తెలియజేయాలని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ చేసే పోరాటంలో ప్రజలందరినీ భాగస్వామ్యులు చేసేలా కృషిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఐ టిడిపి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు అద్దేపల్లి శివ మాట్లాడుతూ.. జగన్ రెడ్డి నిరంకుశ పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు ఆక్రమ కేసులను ఎదుర్కొంటున్న నియోజకవర్గంలో ఐ-టిడిపి చాంపియన్స్ చేసిన పోరాటానికి అభినందించడం జరిగింది.
ప్రజా పోరాటంలో కార్యకర్తలకు అండగా నారా లోకేష్, ఎంపీ కేశినేని నాని,దేవినేని ఉమామహేశ్వర రావు,ఐ-టిడిపి నాయకత్వం కు ఎప్పుడు అండగా వుంటారని భరోసా ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు తెలుగుయువత ప్రధానకార్యదర్శి గుడిపూడి శివశంకర్, సీనియర్ నాయకులు అన్నే రామకృష్ణ, చావా కిరణ్, దుర్గా జగదీష్, నాగేశ్వరరావు, భరత్ నియోజకవర్గంలోని ఐటిడిపి సభ్యులు పాల్గొన్నారు.