గుంటూరు జిల్లా బాపట్ల నుండి 8 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం సముద్ర తీరమే సూర్యలంక తీరం. ఈ తీరానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి యాత్రికులు వస్తుంటారు. సహజ సిద్ధమైన తీరం కావడంతో చుట్టూ అటవీ ప్రాంతం ఉండటంవల్ల ప్రకృతి సోయగాలు ఇక్కడకు వచ్చే యాత్రికులకు కట్టి పడేస్తాయి. వారాంతం సెలవు రోజుల్లో రోజుకు పది వేల మంది యాత్రికులు ఇక్కడకు విచ్జేస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల కోసం ఇక్కడ హోటళ్లు, గెస్ట్ హౌస్ లు అందుబాటులో ఉన్నాయి.
అలాగే రిసార్ట్స్ కుడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ గెస్ట్ హౌస్ లు ఏర్పాటు చేశారు. ఆన్ లైన్లో ముందస్తుగానే బుక్ చేసుకొనే వెసులుబాటు ఉంది. అలాగే రుచికరమైన చేపల వంటకాలు సముద్రం ఒడ్డున లభిస్తాయి. చిన్నారులకు మినీ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. యూత్ కోసం గుర్రపు స్వారీ, వాటర్ బోట్ లు ఉన్నాయి. అలాగే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు. సుదూర ప్రాంతం నుంచి వచ్చే వారికి ఇక్కడి ప్రకృతి అందాలు కట్టి పడేస్తాయి. మరల ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని మదిలో మెదులుతూనే ఉంటాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు.
సూర్యలంకకు వెళ్లాలంటే అటు విజయవాడ నుండి, ఇటు ఒంగోలు నుండి బాపట్లకు రైలు బస్సు సౌకర్యాలు ఉన్నాయి. బాపట్ల నుండి సూర్యలంక కు వెళ్లేందుకు ఆటోలు బస్సులు అందుబాటులో ఉన్నాయి.