ఏపీలో నకిలీ చలాన్లు కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బులు రికవరీ కానీ ఆస్తులపై రిమార్కులు చూపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయంటూ ఈసీ ధృవపత్రాల్లో చూపించనుంది. కాగా రాష్ట్రంలోని 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 8 కోట్లకు పైగా నిధులు గోల్ మాల్ కాగా ఇప్పటివరకు 5 కోట్ల మేర రికవరీ జరిగింది.