న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ లో నేడు రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు స్కూళ్లకు చెందిన చిన్నారులు, మహిళలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రాఖీలు కట్టిన చిన్నారులకు చాక్లెట్లు ఇచ్చారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత…రామ్ నాథ్ కోవింద్ తొలిసారి తన సతీమణితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.