విజయవాడ: నగరంలోని పాతబస్తీ వించిపేటలో ఇమ్రాన్ అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి స్థానికంగా నివాసముండే జాఫర్తో ఇమ్రాన్ గొడవ పడినట్లు ప్రాథమిక సమాచారం సేకరించారు. మృతుడిపై గతంలో దోపిడీ కేసులు ఉన్నాయని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.