ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెలకు రూ.90,000 జీతంలో టెన్త్‌, ఐటీఐ పాసైన వాళ్లకు 535 జాబ్స్‌

national |  Suryaa Desk  | Published : Thu, Aug 26, 2021, 04:13 PM

ఇతర వివరాలు: ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 535 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహిస్తున్న పనుల కోసం పలు పోస్టుల్ని ఆయిల్ ఇండియా లిమిటెడ్ భర్తీ చేస్తోంది. అస్సాంలోని దులియాజన్‌లో గల ఫీల్డ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ పోస్టులున్నాయి. ఇందులో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 23 దరఖాస్తులకు చివరి తేదీ. అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.oil-india.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.


మొత్తం ఖాళీలు: 535


విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పోస్టులను బట్టి టెన్త్‌, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అలాగే పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.


వయసు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 30 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 18 నుంచి 33 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులు ప్రారంభం: ఆగస్ట్ 24, 2021


దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 23, 2021


దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.200. ఎస్‌సీ, ఎస్‌టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.


వేతనం: పోస్టులను బట్టి రూ.26,600 – 90,000 వరకూ ఉంటుంది.


ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


వెబ్‌సైట్‌:https://www.oil-india.com/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com