ఏపీలోని పోస్టాఫీసులన్నింటినీ నవంబరు నెలాఖరు కల్లా సర్వ సేవా కేంద్రాలు(సీఎస్సీ)గా మార్చాలని ఏపీ తపాలా శాఖ నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో తపాలా సేవలతో పాటు 34 రకాల ఆన్లైన్ పౌరసేవలు సైతం అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే కంప్యూటర్లు అందుబాటులో ఉండి, శిక్షణ పొందిన సిబ్బంది ఉన్న 1,568 పోస్టాఫీసులను కామన్ సర్వీస్ సెంటర్లుగా మార్చారు. మరో 8,504 పోస్టాఫీసులను 2 నెలల్లో సీఎస్సీలుగా మార్చాలని తపాలా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
తపాలా సీఎస్సీల్లో అందించే సేవలు ఇవే..
పాన్కార్డ్, పాస్పోర్ట్, ఓటరు ఐడీ కార్డు, మొబైల్ రీఛార్జీలు, బీమా ప్రీమియంలు, ఆర్టీఏ, డీటీహెచ్ సేవలు, కరెంట్ బిల్లులు, నీటి బిల్లులు, గ్యాస్ కనెక్షన్లకు దరఖాస్తు, ఫాస్ట్ట్యాగ్ సేవలు, రైలు, బస్సు, విమాన టికెట్లు, ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి యోజన, పీఎం జన ఆరోగ్య యోజన, పీఎం యోగిమాన్ ధన్ యోజన వంటి పథకాలకు దరఖాస్తులు, సాయిల్ హెల్త్కార్డ్, ఆహార పదార్థాల విక్రయ లైసెన్సులు.