ఇండియాలో గడిచిన 24 గంటల్లో 37,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 34,169 మంది కోలుకోగా 648 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,25,12,366 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వరకు 3,17,54,281మంది కోలుకోగా 4,35,758 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 3,22,327 యాక్టీవ్ కేసులున్నాయి.