కొలంబో: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో అరుదైన ఘనత అందుకున్నాడు. ప్రస్తుతం భారత్-శ్రీలంక మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్లో జడేజా 150 వికెట్ల క్లబ్లో చేరాడు. 34.5వ ఓవర్ వద్ద డిసెల్వాని ఔట్ చేయడంతో జడేజా తన టెస్టు కెరీర్లో 150 వికెట్లను పూర్తి చేశాడు. దీంతో భారత్ తరఫున అతి తక్కువ టెస్టుల్లో 150 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో జడేజా రెండో స్థానంలో నిలిచాడు. 32 టెస్టుల్లో 60వ ఇన్నింగ్స్ ద్వారా జడేజా ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 29 టెస్టుల్లోనే 150 వికెట్లను సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇక ఈ జాబితాలో ప్రసన్న, కుంబ్లే ఉమ్మడిగా మూడో స్థానంలో ఉండగా హర్భజన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో జడేజా, అశ్విన్ అగ్రస్థానాల్లో కొనసాగుతోన్న సంగతి