ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆ విద్యార్థులకు అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 09, 2021, 12:00 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలులోని రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ(ఆర్జేయూకేటీ)ల్లో ఈ నెల 23 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రీ యూనివర్సిటీ కోర్సు సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు తొలుత వీటిని ప్రారంభించి తర్వాత దశలవారీగా అందరికీ ఆఫ్‌ లైన్‌ తరగతులు నిర్వహిస్తారు. గత నెల రోజుల్లో కరోనా బారిన పడిన వారు, ప్రస్తుతం జ్వర లక్షణాలున్నవారు మినహా.. విద్యార్థులంతా ఈ నెల 21, 22 తేదీల్లోనే తమ తమ క్యాంపస్ లకు చేరుకోవాలని ఆర్జేయూకేటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com