తిరుపతి : మద్యం తాగిన యువకుడు ట్రాన్స్ఫార్మర్ను పట్టుకుని మృతిచెందిన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. అలిపిరి ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలమేరకు.. స్థానిక జీవకోన అంబేడ్కర్నగర్లోని అంబేడ్కర్ విగ్రహానికి సమీపంలో ఉన్న ఓ ట్రాన్స్ఫార్మర్ను మద్యం తాగిన గుర్తుతెలియని యువకుడు పట్టుకున్నాడు. వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని ఆచూకీ కోసం ప్రయత్నించగా ఆధారాలు లభించలేదు. స్థానికులను విచారించిన పోలీసులు మృతుడు రాజీవ్గాంధీ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించామని.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఎస్వీ వైద్యకళాశాలకు తరలించారు. ఘటనపై కేసును నమోదు చేశారు.