కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ల రూపంలో మళ్లీ వణికిస్తోంది. బ్రిటన్ లో వెలుగు చూసిన ఈటా వేరియంట్ తాజాగా భారత్ లోకి ప్రవేశించింది. కర్ణాటక మంగళూరుకు చెందిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్ ను గుర్తించారు. ఇతడు నాలుగు నెలల క్రితం దుబాయ్ నుండి దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే గ్రామానికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అతడికి ఇటీవల పాజిటివ్ రావడంతో వైరస్ జన్యు క్రమంపై పరిశోధన చేసేందుకు నమూనాలను పరిశోధన కేంద్రానికి పంపించారు. దీంతో అతడిలో ఈ కొత్త రకం వెలుగు చూసింది.