ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా హాకీస్టార్ రైలు కిందపడి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2017, 08:14 AM

న్యూఢిల్లీ : జాతీయ హాకీ మహిళాజట్టు క్రీడాకారిణి, ప్రముఖ హాకీస్టార్ జ్యోతిగుప్తా (20) మృతదేహాన్ని హర్యానా రాష్ట్రంలోని రేవారి వద్ద రైల్వేట్రాక్‌పై కనుగొన్నారు. తాను రాత్రి 8.30 గంటలకు జాజ్జర్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి దాటి రైలు నడుపుతుండగా రేవారి వద్ద ఆకస్మికంగా ఓ యువతి రైలు ముందుకు వచ్చిందని చంఢీఘడ్ -జైపూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ డ్రైవరు ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను బ్రేకు వేసినా అప్పటికే యువతి రైలు కింద పడిందని డ్రైవరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జ్యోతిగుప్తా తాను ఆలస్యంగా ఇంటికి వస్తానని చెప్పి తన కుటుంబసభ్యులతో చివరిసారి మాట్లాడిందని పోలీసు అధికారి రణవీర్‌సింగ్ చెప్పాడు. వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ పోటీల్లో పాల్గొనేందుకు జ్యోతిగుప్తా మూడునెలల పాటు హిమాచల్ ప్రదేశ్ లోని షిలారోలో శిక్షణ పొందిందని పోలీసులు చెప్పారు. జ్యోతిగుప్తా ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com