జమ్మూలోని కతువా జిల్లా రంజిత్ సాగర్ డ్యాం సమీపంలో భారత ఆర్మీ హెలికాప్టర్ ఒకటి మంగళవారంనాడు కుప్పకూలింది. దీంతో హుటాహుటిన భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. హెలికాప్టర్లో ఎంతమంది ప్రయాణిస్తున్నది వెంటనే తెలియలేదు. ప్రమాద కారణం కూడా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక కార్యక్రమాలు చేపట్టింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.