కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల హౌస్ అరెస్ట్ గడువు ముగియడంతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సిద్ధమయ్యారు. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పాదయాత్రకు ముద్రగడ అనుమతి తీసుకోలేదు. కావున ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. వెనక్కి తగ్గేదే లేదని ముద్రగడ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేపతానని ముద్రగడ పునరుద్ఘాటించారు. పాదయాత్రకు బయల్దేరిన ముద్రగడను తన ఇంటివద్దే పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడను మరోసారి హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.