దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో గడిచిన 24 గంటల్లో 555 మంది మృతి చెందారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,15,72,344 కి చేరింది. దేశంలో 4,23,217కి కరోనా మరణాలు చేరుకున్నాయి. కరోనా నుంచి మరో 42,360 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 4,05,155 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో 45.60 కోట్ల మందికి పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.