బాపట్ల చింతవారిపాలెం రోడ్డులో ఉన్న ప్లాట్లలో ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున స్థానికులు ఈ విషయం గుర్తించారు. మృతుడు బాపట్ల రైల్వే స్టేషన్ దగ్గర టీ స్టాల్ వ్యక్తి శంకర్ అని స్థానికులు చెబుతున్నారు. మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పరిసరాల్లో మద్యం కూల్ డ్రింక్ సీసాలు పడి ఉన్నాయి. మృతుని నోట్లో నుంచి నురగ, చేతిలో సెల్ ఫోన్ ఉంది.