కరోనా వైరస్ ఎటాక్ చేశాక అనేక ఇతర సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. తాజాగా కోవిడ్ వల్ల గర్భిణీలకు ముప్పు తప్పదని తాజా అధ్యయనంలో తేలింది. ఐసీఎంఆర్, ఎన్ఐఆర్ఆర్పీ జరిపిన ఒక అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. కరోనా సోకిన గర్భిణీల నుండి గర్భస్థ శిశువుకు కరోనా సోకుతుందని గుర్తించారు. అలాగే గర్భాస్రావాలకు అవకాశం ఉందని పరిశోధనలో తేలింది.