ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ క్వార్టర్ ఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. భారత జోడీ దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ 2-6 తేడాతో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయారు. ప్రీ క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ అద్భుత విజయం సాధించారు. ప్రీ క్వార్టర్ ఫైనల్ లో లిన్ చియా ఎన్, తంగ్ చిచ్ చూన్ ను దీపికా కుమారి, జాదవ్ కలిసి ఓడించారు.